గాయపడిన గీత కార్మికుడిని పరామర్శించిన సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ముష్టి పెల్లి గీత కార్మికుడు 21-04-2023 రోజున కోమిరే బాబు గౌడ్ రోజు వారి వృత్తి పనిలో భాగంగా తాటి వనానికి వెళ్లి కల్లు గీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ మధ్యనే కోలుకున్న బాదితుడిని ఈరోజు మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు మరియు సిరిసిల్ల పట్టణ 24వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బుర్ర లక్ష్మీ శంకరయ్య , బారసా మాజీ ఎంపీటీసీ బుర్ర మల్లిఖార్జున్ గౌడ్ లు పరామర్శించినారు.

బాధితునికి తక్షణమే ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ తీగల శ్రావణ్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల మురళి మోహన్ గౌడ్ లు కోరుతున్నారు.

విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Latest Rajanna Sircilla News