రుణ మాఫీ పట్ల నేతల సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :రైతు రుణమాఫీపై మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోవడం పట్ల వేములవాడ అర్బన్ మండలం అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది కమాన్ చౌరస్తాలో అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు సంబరాలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకి పాలాభిషేకం చేశారు.

రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం పట్ల అప్పుల్లో కురుకున్న రైతులకు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తుందన్నారు.

ఇట్టి కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, కత్తి కనకయ్య గాలిపల్లి స్వామి వంకాయల భూమయ్య, ఆగయ్య, ఇటిక్యాల లింగయ్య, తాడెం శ్రీనివాస్, సామల రమేష్, బొమ్మ తిరుపతి,కట్ట గణేష్, గాలిపల్లి బాబు, మధ్యల నవీన్, తునికి రాజు, గుండెల్లి నరేష్,బొమ్మ మహేష్,తదితర నాయకులు పాల్గొని సంబరాలు చేశారు.

ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హార్ట్ డే .
Advertisement

Latest Rajanna Sircilla News