మోసపూరిత హామీలతో అధికారంలోకి.. కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది.

ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి(Rakesh Reddy) మద్ధతుగా చేపట్టిన ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (KTR, RS Praveen Kumar)పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt)కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందన్నారు.

రైతు భరోసా, రైతుబంధు (Rythu Bharosa, Rythu Bandhu)ఒక్కరికీ కూడా రాలేదన్న ఆయన మెగా డీఎస్సీపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

ఈ క్రమంలోనే మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని సూచించారు.

Advertisement
ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదు అంటూ చంద్రబాబు సంచలన పోస్ట్..!!

తాజా వార్తలు