ఆరోజు ఆటోలో కూర్చొని బాగా ఏడ్చాను.. కృతిసనన్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఆఫర్లతో ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో కృతిసనన్ కూడా ఒకరు.

కృతిసనన్ కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపుతున్నారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాతో పాటు కృతిసనన్ చేతిలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి.తెలుగులో వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కృతిసనన్ నటించారు.

ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా తర్వాత కృతికి ఆఫర్లు పెరిగాయి.బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు రావడంతో పాటు రికార్డు స్థాయిలో పారితోషికాన్ని కృతి అందుకుంటున్నారు.

అయితే తాను మోడలింగ్ చేస్తున్న సమయంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో కృతిసనన్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాను ర్యాంప్ వాక్ చేసిన సమయంలో ఒక కొరియోగ్రాఫర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె కామెంట్లు చేశారు.షో ముగిసే సమయంలో 20 మంది మోడల్స్ ముందు కొరియోగ్రాఫర్ తనను తిట్టాడని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సంఘటన జరిగిన తర్వాత తాను ఆటోలో కూర్చొని బాగా ఏడ్చానని కృతిసనన్ వెల్లడించారు.

ఆ తర్వాత తాను ఇంటికి వెళ్లి అమ్మతో ఆ విషయాన్ని చెప్పుకుని బాధ పడ్డానని కృతి పేర్కొన్నారు.

అమ్మ తాను కెరీర్ విషయంలో సక్సెస్ అవుతానో లేదో తెలియదని మొదట మానసికంగా స్ట్రాంగ్ కావాలని సూచనలు చేశారని కృతి వెల్లడించారు.మొదట తనపై తనకు నమ్మకం ఉండాలని అమ్మ చెప్పిందని కృతి సనన్ పేర్కొన్నారు.అలా కెరీర్ తొలినాళ్లలో అవమానాలను ఎదుర్కొన్న కృతి సనన్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి.

హమ్ దో హుమారే అనే సినిమాలో ప్రస్తుతం కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు