ఆ ఉత్తరం చదివి కన్నీళ్లు పెట్టుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు.. అందులో ఏముందంటే?

రాధేశ్యామ్ సినిమాలో పరమహంస పాత్రతో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.ప్రభాస్ గురువు పాత్రలో కృష్ణంరాజు నటించగా కృష్ణంరాజు ఆ పాత్రకు ప్రాణం పోశారని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

82 సంవత్సరాల వయస్సులో కూడా కృష్ణంరాజు నచ్చిన కథలను, పాత్రలను ఎంపిక చేసుకుంటూ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.రాధేశ్యామ్ సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రభాస్ ను, కృష్ణంరాజును స్క్రీన్ పై చూడటానికి రెండు కళ్లు సరిపోలేదని ఆమె వెల్లడించారు.తెరపై ప్రభాస్, కృష్ణంరాజును చూస్తే తనకు కళ్లు చెమర్చాయని ఆమె చెప్పుకొచ్చారు.

కృష్ణంరాజు పరమహంస రోల్ లో దేవుడిలా కనిపించారని శ్యామలాదేవి అన్నారు.కృష్ణంరాజును అలా చూసి చేతులెత్తి దండం పెట్టామని శ్యామలాదేవి అన్నారు.

Advertisement

రాధేశ్యామ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన సమయంలో చాలామంది ట్రైలర్ లో పరమహంస పాత్రలో కృష్ణంరాజును చూసి కాల్ చేసి ప్రశంసించారని శ్యామలాదేవి అన్నారు.

కృష్ణంరాజు తండ్రికి పిల్లలపై చాలా నమ్మకం ఉండేదని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.కృష్ణంరాజు మద్రాస్ లో సినిమా ఆఫర్ల కోసం కష్టపడుతున్న సమయంలో మీ అబ్బాయి సినిమాల్లో చేరి చెడిపోతున్నాడంటూ అజ్ఞాత వ్యక్తి కృష్ణంరాజు తండ్రికి ఉత్తరం రాశారని ఆ తర్వాత కృష్ణంరాజు తండ్రి ఆ ఉత్తరంతో పాటు మరో ఉత్తరాన్ని జత చేసి మరో ఉత్తరంలో తన కొడుకుపై పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని అలా నెగిటివ్ గా చెప్పేవాళ్లకు దూరంగా ఉండాలని సూచించారని శ్యామలాదేవి తెలిపారు.ఆ ఉత్తరం చదివి కృష్ణంరాజు కన్నీళ్లు పెట్టుకున్నారని శ్యామలాదేవి వెల్లడించారు.

తల్లిదండ్రులకు పిల్లలపై నమ్మకం ఉంటే మాత్రమే రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్ అలవాటు అవుతుందని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.గోదావరిలో దొరికే పులస అంటే ప్రభాస్ కు ఎంతో ఇష్టమని శ్యామలాదేవి వెల్లడించారు.పులస వండితే డైట్ ను పక్కన పెట్టి ప్రభాస్ తింటారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు