మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొట్టు సత్యనారాయణ

సచివాలయంలో ఉపముఖ్యమంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.

దేవాలయాలకు భక్తులు ఇచ్చిన భూముల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ఆలయాల్లో సౌకర్యాల పెంపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కరోనా తర్వాత ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిందని.వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగిందని చెప్పారు.

ఆలయాల్లో భద్రత పెంపుకు చర్యలు చేపటడతామన్నారు.ఆలయాల్లో జరుగుతున్న దాడులు ప్రేరేపితంగా ఉన్నాయని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

తాజా వార్తలు