ఎన్టీఆర్ ను కలిసిన కొరటాల.. పిక్ వైరల్..!

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అని ఇన్నాళ్లు అందరూ అనుకుంటూ ఉన్నారు.

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడో క్లారిటీ వచ్చేసింది.ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల శివతో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.

ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.అయితే ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఎన్టీఆర్ ను దర్శక నిర్మాతలు కలిసి నట్టు తెలుస్తుంది.

Advertisement

ఈ సందర్భంగా కొరటాల శివ, మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.ఈ సినిమాను జూన్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్లే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు.ఈ సినిమా ఏప్రిల్ 29 2022 న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.

వీరి కాంబినేషన్ లో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టింది.అయితే మరొకసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వుతుండడంతో ఇప్పటికే అభిమానులు అంచనాలు పెంచేసుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు