ఏడాదిన్నర తరువాత కేజీఎఫ్‌కు మోక్షం

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం గురించి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా కన్నడ హీరో యశ్ మెయిన్ లీడ్‌లో నటించాడు.

ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో ఇది బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.ముఖ్యంగ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రావడంతో ఇది ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంలో పూర్తి సక్సెస్ అయ్యింది.2018లో వచ్చిన కేజీఎఫ్ చిత్రానికి భాషాబేధం లేకుండా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు.

అంతేగాక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా కొన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.అయితే ఈ సినిమాను చాలా మంది థియేటర్స్‌లో చూడలేకపోయారు.దీంతో ఈ సినిమాను టీవీలో వచ్చినప్పుడు చూద్దామనే వారు చాలా మంది ఉన్నారు.

కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఏ టీవీ ఛానల్‌లో ప్రసారం కాలేదు.అయితే కేజీఎఫ్ చిత్రం కోసం టీవీ ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితం దక్కనుంది.

Advertisement

తాజాగా ఈ కేజీఎఫ్ తెలుగు చిత్రాన్ని ప్రముఖ ఛానల్ ‘స్టార్ మా’లో ఆదివారం(జూలై 5) రోజున ప్రసారం చేయనున్నారు.దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యారు.

అటు ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్‌తో స్టార్ మా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి కేజీఎఫ్ టీవీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు