ఏపీలో ఆదాయం ఇచ్చే శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పన్ను చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయాలని సూచించారు.రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ తెలిపారు.
రేట్లు పెంచడంతో మద్యం వినియోగం తగ్గిందన్నారు.గంజాయి, అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి నివారణతో పాటు ఉపాధి మార్గాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్ గ్రేడ్ చేయాలని వెల్లడించారు.
నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో వెంటనే కార్యకలాపాలను మొదలు పెట్టేలా చూడాలని ఆదేశించారు.