Pithapuram YCP : పిఠాపురం వైసీపీలో కీలక పరిణామాలు.. అభ్యర్థిపై క్లారిటీ..!?

ఏపీ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా వైసీపీలో( YCP ) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) చేరారు.

 Key Developments In Pitapuram Ycp Clarity On The Candidate-TeluguStop.com

దీంతో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.ఈ క్రమంలోనే సీఎం క్యాంప్ కార్యాలయానికి పిఠాపురం ఇంఛార్జ్ వంగా గీత( Vanga Geetha ) చేరుకున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే పిఠాపురం పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

పవన్ బరిలో నిలుస్తున్న నేపథ్యంలో పిఠాపురంపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది.

మరోవైపు పవన్ పై( Pawan Kalyan ) పోటీ చేస్తానని గతంలో ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే.ప్రస్తుత పరిస్థితులతో పిఠాపురం నుంచి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే అంశంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.

వంగ గీతనే అభ్యర్థిగా ఉంచుతారా? లేక ముద్రగడను అభ్యర్థిగా ప్రకటిస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube