మిస్ ఇండియా ట్రైలర్ టాక్: చాయ్‌తో నీళ్లు తాగించిన కీర్తి సురేష్

అందాల భామ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

మహానటి వంటి బిగ్గెస్ట్ కెరీర్ హిట్‌ను అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది.

ఇప్పటికే పెంగ్విన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, తాజాగా మరో రెండు సినిమాలను రెడీ చేస్తోంది.ఇప్పటికే గుడ్ లక్ సఖీ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కీర్తి, తాజాగా మిస్ ఇండియా చిత్రాన్ని కూడా పూర్తి చేసింది.

కాగా మిస్ ఇండియా చిత్ర ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల, బిజినెస్ రంగంలో ఎలా రాణించింది అనేది చిత్ర కథగా దర్శకుడు మనకు చూపెట్టే ప్రయత్నం చేశాడు.

నరేంద్రనాథ్ అనే కొత్త డైరెక్టర్ ఎంచుకున్న కథ పాతదే అయినా, అతడు ఈ సినిమాను సరికొత్తగా తెరకెక్కించాడని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది.ఎలాంటి ప్రోత్సాహం లేకుండా సొంతంగా వ్యాపార రంగంలో ఎలా దూసుకుపోయిందనే అంశాన్ని మనకు ఈ సినిమాలో చూపించనున్న విధానం ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Advertisement

ఇక ఈ సినిమాలో భారీ తారాగణం సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన జగపతి బాబు సినిమాకు మేజర్ అసెట్ కానున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇండియాకు చెందిన చాయ్‌ను కీర్తి సురేష్ విదేశంలో ఎలా అమ్ముతుంది అనే కథ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.ఇక ఈ సినిమాను మహేష్ కోనేరు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాను నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 4న స్ట్రీమ్ చేయనుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు