భారత్ లో యంగ్ ఉమెన్ పైలెట్ గా 15 ఏళ్ల అమ్మాయి..!

నేటి సమాజంలో చాల మంది వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఎన్నో అద్భుతాలు, విన్యాలు, రికార్డులు సృష్టిస్తున్నారు.

తాజాగా కశ్మీర్ యువతి ఆయేషా అజీత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఆయేషా దేశంలోనే అతి పిన్నవయస్కురాలైన మహిళా పైలెట్ గా నిలిచారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కశ్మీర్ యువతి ఆయేషా అజీత్.ఆమె వయసు 25 సంవత్సరాలు.15 ఏళ్ల వయసులోనే ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన ఈ కశ్మీర్ అమ్మాయి, 16 ఏళ్లకే రష్యాలోని సోకోల్ ఎయిర్ బేస్ లో మిగ్-29 జెట్ ట్రైనర్ ద్వారా శిక్షణ పొందారు.ఇక 2017లో ఆమె బాంబే ఫ్లయింగ్ క్లబ్ నుంచి వైమానిక రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

అదే ఏడాది కమర్షియల్ లైసెన్స్ కూడా అందుకున్నారు.

Advertisement

తాజాగా తన ఘనతపై ఆయేషా మీడియాతో మాట్లాడుతూ, తనకు బాల్యం నుంచి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టమని వెల్లడించారు.ముఖ్యంగా గగనవిహారం అంటే పిచ్చి అని తెలిపారు.ఎంతో మంది ప్రజలను కలుసుకునే వీలుంటుందని, ఈ కారణాలతోనే తాను పైలెట్ అయ్యానని ఆయేషా వివరించారు.

ఇది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే సాధారణ ఉద్యోగం కాదని, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని, అక్కడ భిన్న వాతావరణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.వీటిన్నింటికి తాను సిద్ధమేనని ఆయేషా తెలిపారు.

ఇక కశ్మీరీ అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్నారని.ముఖ్యంగా విద్యలో ప్రతిభాపాటవాలు కనబరుస్తున్నారన్నారు.

నేటితరం యువత కేవలం ఉన్న ప్రాంతంలోనే ఉండాలని అనుకోవట్లేదు.కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి రాణించాలనికోరుకుంటున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ముఖ్యంగా కశ్మీర్ యువతులు చాలా రంగాల్లో రాణిస్తున్నారు.కశ్మీర్ లో యువతులు, మహిళలు సగం మంది మాస్టర్స్ డిగ్రీ, లేక డాక్టరేట్ చేస్తున్నవారేనని ఆయేషా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు