కరోనా బారిన పడ్డ కన్నడ స్టార్ హీరో ధృవ్ షార్జా, అతని భార్య

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా రోజు రోజుకు విస్తరిస్తుంది.దీని బారిన పడేవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిపోతుంది.

ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.చాలా వేగంగా ఈ వైరస్ విస్తరిస్తుంది.

సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు.అయితే కరోనాతో మరణాల రేటు తక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం అయినా కూడా ఈ వైరస్ కారణంగా సమాజంలో అంతరానివారిగా ప్రజలు మారిపోతున్నారు.

ఇదిలా ఉంటే కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరో ధృవ్ షార్జా, అతని భార్య ప్రేరణ కరోనా బారిన పడ్డారు.ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారినపడి కోలుకున్నారు.

Advertisement

అమితాబచ్చన్ కుటుంబ కూడా కరోనా బారిన పడింది.ఇక సౌత్ లో కూడా తెలుగు నుంచి నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడి కోలుకున్నారు.

పలువురు సీరియల్ నటులు కరోనా బాధితులుగా మారిపోయారు.ఇక ఇప్పుడు కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జాతో పాటు ఆయన సతీమణి ప్రేరణకు కోవిడ్ నిర్థారణ అయింది.

ఈ విషయాన్ని ధృవ్ స్వయంగా ట్వీట్టర్ వేదికగా తెలిపారు.రెండు నెలల క్రితం ధృవ్ షార్జా అన్నయ్య అర్జున్ షార్జా గుండెపోటుతో మరణించారు.

ఆ విషాదం నుంచి కోలుకోక ముందే ధృవ్ షార్జా కరోనా బారిన పడటం కన్నడ చిత్రపరిశ్రమని కలవరపెడుతుంది.గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలు కనిపించడంతో మేము టెస్టులు చేసుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందనీ, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు ధృవ్ షార్జా ట్వీట్‌లో పేర్కొన్నారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
ఇండస్ట్రీ కి తొలి నట వారసుడు, రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన నందమూరి వారసుడు..?

అలాగే కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని ఆయన పేర్కొన్నారు.ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు