మరో సీక్వెల్ లో నటిస్తున్న కమల్!

ఇటీవల పాత సినిమా లకు సీక్వెల్స్ ఎక్కువగా వస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా మరో సీక్వెల్ సినిమా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కమల్ హాసన్ కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో క్షత్రియ పుత్రుడు ఒకటి.అయితే ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని చూస్తున్నారు.అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఏకంగా కమలే రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.1992లో తమిళనాట విడుదలైన దేవర్ మగన్ సంచలన విజయాన్ని సాధించింది.తెలుగులో క్షత్రియపుత్రుడు పేరుతోను భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన కమల్, అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలెట్టినట్టుగా తెలుస్తోంది.తొలి షెడ్యూల్ ను పొల్లాచ్చి లో ఆరంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇప్పటికే భారతీయుడు 2 చేస్తున్న కమల్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన కారణంగా ఈ కారణం తీసుకున్నట్లు సినీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వార్త లో ఎంత నిజం ఉంది అనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు.

Advertisement

అయితే దీనిపై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు