అనగనగా ఓ దెయ్యం అంటున్న కమల్ హాసన్..!

భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు కమల్ హాసన్.

విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ తాజాగా తన పుట్టినరోజును జరుపుకున్నారు.

ఇదివరకు ఖైదీ సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్, అలాగే చిత్రం టైటిల్ విడుదల చేశారు.

ఈ టీజర్ విషయానికి వస్తే ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతోంది.కమల్ హాసన్ ఓ వైపు ఇండియన్ 2 సినిమాను చేస్తూనే మరోవైపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

కమల్ హాసన్ తన 232వ చిత్రంగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి విక్రమ్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

Advertisement

ఇక ఈ టీజర్ లో ముఖాలకు మాస్క్ లు కట్టుకున్న వారిని భోజనాలు కూర్చోబెట్టి ఇక ఆహారం బిడ్డ అంటూ లోకనాయకుడు చెప్పే డైలాగ్ తో సినిమా టైటిల్ ని రిలీజ్ చేశారు.అలాగే ఈ చిత్ర టీం ని కూడా టీజర్ లో ఒన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ ఘోస్ట్ అనే ఈ విధంగా టీజర్ చివర్లో రూపొందించారు.

అయితే ఇది వరకే కమల్ హాసన్ 1986లో విక్రమ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కించారు.అది కూడా ఓ అడ్వెంచర్స్ సినిమానే.

ఆ సినిమా కూడా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాని తమిళ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఈ సినిమా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.2021 వేసవికాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తోంది.ఇకపోతే దర్శకుడు లోకేష్ కనకదాస్ ఈ సినిమా కంటే ముందు తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఆ సినిమా విడుదల కాకుండానే ఇప్పుడు కమల్ హాసన్ ని పెట్టి విక్రమ్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఖైదీతో భారీ విజయాన్ని అందుకున్న లోకేష్ కనకరాజు ఈసారి కూడా విజయం సాధిస్తాడో లేదో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు