నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ సినిమా బింబిసార.ఎప్పటి నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో కళ్యాణ్ ఒకరు.
ఈయన ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో అనిపించు కోలేక పోయారు.కెరీర్ లో ఇప్పటి వరకు రెండు హిట్లు మాత్రమే అందుకున్నాడు.
అందుకే బ్లాక్ బస్టర్ హిట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.ఏడాదిన్నర తర్వాత బింబిసార సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.ఆగష్టు 5న నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడు కథాంశంతో ఆసక్తికరంగా నూతన డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా ఫ్యాన్స్ డిసైడ్ చేసారు.
చాలా ఏళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ హిట్ అందుకోవడమే కాకుండా సూపర్ హిట్ అని టాక్ రావడంతో సంతోషంగా ఉన్నారు.ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా అని అందరు అడుగుతున్నారు.దీనికి సమాధానంగా కళ్యాణ్ రామ్ సీక్వెల్ కూడా ఉంటుంది అని స్వయంగా చెప్పాడు.
దీంతో సీక్వెల్ ఎలా ఉంటుందో అని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూడడం మొదలు పెట్టేసారు.