నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన బింబిసార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్ తో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలను ఈ సినిమా దక్కించుకుంది.
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.సాధారణం గా సినిమా విడుదలైన కొన్ని వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన వార్తలు వస్తాయి.
కానీ ఈ సినిమా విడుదల రోజే డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, ఈ సినిమా ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అయిన జి5 వారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
భారీ ఎత్తున రేటు పెట్టి మరి ఈ సినిమా ను వారు కొనుగోలు చేశారట.
సినిమా కు సంబంధించిన స్ట్రీమింగ్ అప్డేట్ అతి త్వరలోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది.సినిమా నేడే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పైగా సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కనుక తప్పకుండా ఈ సినిమా 50 రోజుల పాటు థియేటర్ లో ఆడుతుంది, ఆ తర్వాత మాత్రమే డిజిటల్ ప్లాట్ఫాం పై వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కనుక ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమా ను థియేటర్ల ల ద్వారానే చూసే అవకాశం ఉంది.50 రోజుల తర్వాత ఈ సినిమా ను డిజిటల్ స్ట్రీమింగ్ చేసేందుకు గాను.ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జీ 5 సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
బిందుసార సినిమా తో పాటు నేడు సీతారామం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన ఓ టి టి అప్డేట్ కూడా వచ్చేసింది.
అది అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.