ఎన్టీఆర్ కి జోడీగా టాలీవుడ్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్‌ ఇప్పటికే బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది.మొదటి సినిమాతోనే శ్రీదేవికి సరైన వారసురాలిని అని ప్రూవ్ చేసుకుంది.

ఇక రెండో సినిమానే ఏకంగా బయోపిక్ కథని ఒకే చేసి తనలో నటిని మరోసారి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది.ఇక ఈ సినిమా ఆగష్టు 12న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ని తెలుగు తెరకి పరిచయం చేయాలని చాలా మంది దర్శక, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.అయితే ఆమె మాత్రం సరైన సినిమాతో గ్రాండ్ గా లాంచ్ అవ్వాలని అనుకుంటుంది.

టాలీవుడ్ లో తన తల్లి క్రియేట్ చేసిన వేవ్ ని క్రియేట్ చేయకపోయినా ఆమెని గుర్తు చేయాలంటే బెస్ట్ లాంచింగ్ ఉండాలని భావించి సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది.ఈ నేపధ్యంలో త్వరలో ఆమె తెలుగు ఎంట్రీ ఖాయం అయ్యేలా కనిపిస్తుంది.

Advertisement

జాన్వీ కపూర్ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఒకటి ప్రస్తుతం వైరల్‌ అయ్యింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా జాన్వీ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇటీవలే బోనీకపూర్‌, జాన్వీకి దర్శకుడు త్రివిక్రమ్‌ కథ నెరేట్‌ చేయడం జరిగిందని సమాచారం.ఇక త్రివిక్రమ్ సినిమాలు అంటే కథ మొత్తం హీరోయిన్ పాత్రల చుట్టూనే తిరుగుతుంది.

ఈ కథ కూడా అలాగే హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో జాన్వీ కపూర్ కి కూడా నచ్చిందట.టాలీవుడ్ లో త్రివిక్రమ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కావడంతో ఈ సినిమాతో జాన్వీని లాంచ్ చేస్తే బాగుంటుంది అని బోనీ కపూర్ కూడా భావిస్తున్నారు.

ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోతో జాన్వీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉంటుందని భావించిన ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగల్‌ ఇచ్చారని తెలుస్తోంది.పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోయే ఈ చిత్రానికి అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్‌ పరిశీలినలో ఉంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు