ఆదిలాబాద్ నగరంలో రూ.23 లక్షల విలువైన నగలు చోరీ..!

ఇటీవలే కాలంలో దారి దోపిడీలు, ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఉన్న సమయంలోనే దొంగలు దోపిడీలకు పాల్పడుతున్న రోజులువి.అలాంటిది ఏదైనా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు కనిపిస్తే చాలు క్షణాల్లో ఆ ఇంట్లో భారీ దోపిడీ కచ్చితంగా జరుగుతుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.

 Jewelery Worth Rs 23 Lakh Stolen In Adilabad City , Adilabad City , Jewelery Wor-TeluguStop.com

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఆదిలాబాద్( Adilabad ) పట్టణంలోని నారాయణ ఎన్ క్లేవ్స్ లో( Narayana en Claves ) ఆదివారం రాత్రి భారీ దోపిడీ జరిగింది.దాదాపుగా రూ.23 లక్షల విలువైన బంగారు నగలు చోరీకి గురవడంతో స్థానికంగా ఉండే వారంతా భయాందోళనకు గురయ్యారు.నారాయణ ఎన్ క్లేవ్స్ కాలనీలో జి.కొమురయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ఆదివారం రాత్రి సుమారుగా 7:50 గంటల సమయంలో దుర్గామాత మండపంనికి వెళ్లి ఓ అరగంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు.అంతలోపే ఇంటి తాళం పగలగొట్టి ఉండడం చూసి, కంగారుతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.20 తులాల బంగారు, 35 తులాల వెండి, రూ.11 లక్షల నగదు కనిపించలేదు.

దీంతో కొమురయ్య( Komuraya ) కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ దొంగతనం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది.

కేవలం అరగంట సమయంలోనే దొంగతనం చేయడం దుండగులకు ఎలా సాధ్యమైంది.కొమురయ్య కుటుంబ సభ్యులు బయటకు వెళ్తున్న సంగతి ఆ దుండగులకు ఎలా తెలుసు.

ఈ భారీ దోపిడీలో కొమురయ్యకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ వార్త స్థానికంగా ఉండే వారికి భయబ్రాంతులకు గురిచేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube