ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కాంబో అంటే ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి.ఎందుకంటే ఈ కాంబోలో ఇప్పటికే ముచ్చటగా మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు మూడు కూడా మంచి హిట్ అయ్యాయి.ఇక హ్యాట్రిక్స్ హిట్ తమ ఖాతాలో వేసుకున్న తర్వాత మరోసారి ఈ కాంబో కలిసి పని చేయబోతుంది.
ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అప్డేట్ వచ్చింది.తమ నాల్గవ సినిమాను అఫిషియల్ గా ప్రకటించగా ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ రోజే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమా విషయంలో తాజాగా స్టోరీ గురించి ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.

వచ్చే ఏడాది జనవరి లాస్ట్ లో ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది అని టాక్.ఇది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి కథ కూడా అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ ముంబై నేపథ్యంలో జరిగే పోలీస్ డ్రామా అని టాక్.
స్టోరీ లైన్ నే ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఇక త్రివిక్రమ్ తన మేకింగ్ తో ఈ మూవీని ఏ రేంజ్ కు తీసుకు వెళతాడో వేచి చూడాలి.

మొత్తం మీద వీరి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా మరింత గ్రాండ్ గా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.పూజా హెగ్డే( Pooja Hegde ) ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్నాడు.ఇది సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.అలాగే త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నాడు.
ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఇలా ఈ ఇద్దరి ప్రాజెక్టులు పూర్తి అయితే కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.







