వయసు మళ్ళిన రైతు పాత్రలో తెలుగు హీరో....

విభిన్న పాత్రల్లో నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి సీనియర్ హీరో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గురించి సినీ పరిశ్రమలో పెద్దగా తెలియని వారుండరు.

అయితే అప్పట్లో రాజశేఖర్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలకు గట్టిపోటీని ఇచ్చాడు.

కాకపోతే ఈ మధ్యకాలంలో రాజశేఖర్ నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొంతమేర రాజశేఖర్ గడ్డుకాలం ఎదుర్కొన్నాడు.

అయితే ఆ తర్వాత రాజశేఖర్ చివరగా నటించిన టువంటి గరుడవేగ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేయడంతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడు.అయితే ప్రస్తుతం రాజశేఖర్ "అర్జున" అనే ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన మరియం జకారియా హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రంలో సీనియర్ విలక్షణ నటులు కోట శ్రీనివాస రావు, చలపతిరావు రేఖ మురళీశర్మ శివాజీరాజా సుప్రీత్ వంటివారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

Advertisement

అయితే ఈ చిత్రానికి దర్శకుడు కన్మణి దర్శకత్వం వహించాడు.

అయితే దర్శకుడు కన్మణి మాట్లాడుతూ ఈ చిత్రం ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులు చేసే టువంటి మోసాలకు ప్రజలు ఎలా బలవుతున్నారని మరియు అంతేగాక ప్రజలను మోసం చేసి సంపాదించిన టువంటి సొమ్ముని తెలివైన ఓ యువకుడు ఎలా రికవరీ చేశాడో అనే అంశంపై ఉంటుందని తెలిపాడు.అంతేగాక వయసు మళ్ళిన రైతు పాత్రలో డాక్టర్ రాజశేఖర్ నటిస్తూ అలాగే ఆయన కొడుకు పాత్రలో కూడా నటించినట్లు తెలిపారు.అయితే ఈ చిత్రం విడుదల తేదీని తొందర్లోనే తెలియజేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు