ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కు దక్కిన గౌరవంతో జగన్ లో భయం పట్టుకుంది - పోతిన వెంకట మహేష్

విజయవాడ: జనసేన నేత పోతిన వెంకట మహేష్. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కు దక్కిన గౌరవంతో జగన్ లో భయం పట్టుకుంది.

 Janasena Leader Pothina Venkata Mahesh Comments On Pawan Kalyan Delhi Tour, Jana-TeluguStop.com

నిజాయతీగా ఉన్న వ్యక్తి కాబట్టే జాతీయ నాయకులు అయినా ఎదురేగి స్వాగతం పలికారు.జగన్ లాగా కేసులు, అప్పులు కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలు చేయడం లేదు.

రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసమే యన్డీఎ సమావేశంలో పవన్ పాల్గొన్నారు.ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్ని పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరుగుతున్నాయి.

వాలంటరీ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేయడంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది.పవన్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులకు వారి భవిష్యత్తు ఏంటో వారికి స్పష్టంగా తెలిసిపోయింది.

వాలంటరీ వ్యవస్థ పై ఆరోపణలు చేశారని పవన్ కళ్యాణ్ గారిపై కేసు నమోదు చేయడం వింతగా ఉంది.

వైసీపీ ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిని పక్కదారి మళ్ళించడానికే ఈ కేసులు.13 సిబిఐ మూడు ఈడి కేసులు ఉన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వగా లేనిది.ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిపై కుట్రతో ఒకటి అర కేసులు పెడితే.

పవన్ కళ్యాణ్ గారి చిటికిన వేలు మీద వెంట్రుక కూడా కదలదు.పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వైసీపీ నాయకులు దమ్ముంటే సమాధానం చెప్పాలి.

వాలంటీర్ల వ్యవస్థకు అధిపతి ఎవరు సీఎం, ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ ఎవరు? ముందు ప్రజలకు సమాధానం చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube