గత కొన్ని ఏళ్లుగా దేశంలో జరుగుతున్న సంచలనాత్మక విషయాలపై తనదైన శైలి లో సినిమాలు తీస్తూ వస్తున్న వర్మ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్న విషయం తెలిసింది.వైసీపీ మీద వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో ట్విట్టర్ బదులిస్తున్న వర్మ పూర్తిస్థాయి వైసిపి నాయకుడిగా మారిపోయారని విమర్శలను కూడా ఎదుర్కొంటున్నా కూడా లెక్కచేయకుండా ముందుకు వెళ్తున్నారు.
తాను దర్శకత్వం వహిస్తున్న వ్యూహం, శబధo సినిమాలు ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపికి అనుకూలంగా ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేసిన వర్మ, వైయస్ మరణం తర్వాత అకుంఠిత దీక్షతో జగన్ చేసిన పాదయాత్రను ఈ సినిమా ద్వారా హైలెట్ చేయబోతునట్టుగా తెలుస్తుంది .

అప్పటి అదికార పక్ష కుట్రలను ఎలా తిప్పికొట్టి అధికారంలోకి వచ్చారన్న పాయింట్నే మెయిన్ అజెండాగా సినిమా తీయబోతున్నారు అని సమాచారం .అయితే ఇందులో ఉద్దేశపూర్వకంగానే నిజాలను వక్రీకరించి వైసిపికి రాజకీయ లబ్ధి కలిగించే విధంగా వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.వర్మ సినిమా ద్వారా ఎన్నికలలో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుందన్న అనుమానంతో దానికి విరుగుడు మంత్రం గా ప్రతివ్యూహం సినిమాను జనసేన నేతలు ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఆ పార్టీ అధికారం ప్రతినిది కుసంపూడి శ్రీనివాస్ ఇప్పటికే ప్రతి వ్యూహం పేరుతో సినిమా నిర్మించబడుతుందంటూ ప్రకటించారు

వైయస్ మరణం తర్వాత అధికారం సాధించడానికి జగన్ చేసిన ప్రయత్నాలను ఈ సినిమాలో వివరించబోతున్నట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా వైసిపిని ఇరుకున పెట్టే అంశాలైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తదనంతర విషయాలని, వైఎస్ షర్మిల పార్టీకి దూరమైన ఉదంతాలను మరియు జగన్ పై పెట్టబడిన కేసులను ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరో నిర్మాత ఎవరు నటీనటులు ఎవరైనా విషయాలను మాత్రం ఇంతవరకు ఏ సమాచారం లభించలేదు.మరి వ్యూహ ప్రతి వ్యూహాలలో ఓటర్ల మద్దతు గెలుచుకున్న సినిమాగా ఏదో మిగులుతుందో చూడాలి
.