సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth )హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dilipkumar )దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జైలర్”.ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సంచలన విజయంగా నిలిచింది.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు కావొస్తున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.గత దశాబ్దంలో రజినీకాంత్ ఈ రేంజ్ హిట్ అందుకోలేదనే చెప్పాలి.
మరి అలాంటి సమయంలో రజినీకాంత్ తాజాగా వచ్చిన సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకుని వీక్ డేస్ లో కూడా దూసుకెళ్తుంది.ఇన్నేళ్ల దాహాన్ని ఒక్క సినిమాతో తీర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది.జైలర్ సినిమా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తుంది.ఇక ఈ సినిమా ఇప్పుడు మరో సంచలన రికార్డును అందుకున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి 500 మార్క్ చేరుకునేందుకు సిద్ధంగా ఉంది.ఇక తెలుగులో కూడా అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను అందుకుంటున్న ఈ సినిమా లేటెస్ట్ గా కర్ణాటకలో భారీ రికార్డ్ సాధించినట్టు తెలుస్తుంది.
అక్కడ కూడా ముందు నుండి స్పెషల్ షోలతో భారీ వసూళ్లు అందుకుంటుంది.
ఈ సినిమా 9 రోజుల్లో కర్ణాటకలో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.దీంతో జైలర్ ( Jailer )సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుండి ఈ ఘనత సాధించిన రెండవ సినిమాగా నిలిచింది.మొత్తం 9 రోజుల్లో కర్ణాటకలోనే 52.2 కోట్ల గ్రాస్ ను అందుకుందట.ఇలా ఒక్కో రికార్డును తన ఖాతాలో వేసుకుంటూ పోతుంది.
ఇక జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ కీలక రోల్స్ పోషించారు.సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.