ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’( Memantha Siddham ) బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో( Chittoor District ) కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఇవాళ గురవరాజుపల్లెలో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

మల్లవరం, ఏర్పేడు మీదుగా పనగల్లుకు చేరుకోనున్నారు.తరువాత శ్రీకాళహస్తి బైపాస్ నుంచి చిన్నసింగమలకు జగన్ యాత్ర కొనసాగనుంది.

చిన్నసింగమల వద్ద డ్రైవర్స్ అసోసియేషన్స్ నేతలతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహించనున్నారు.

తరువాత నాయుడుపేట బైపాస్ సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.సభలో ప్రసంగం ముగిసిన అనంతరం ఓజిలి క్రాస్, బుదనం మీదుగా సీఎం జగన్ గూడూరుకు చేరుకోనున్నారు.మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

Advertisement
ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు