శ్రీదేవీ డ్రామా కంపెనీ బ్యాక్ గ్రౌండ్‌లో ఇంత జరుగుతుందా?.. అసలు విషయం చెప్పిన నూకరాజు

ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో ఎంటర్టైన్మెంట్ షో లు ప్రసారం అవుతూ బాగా సందడి చేస్తున్నాయి.ఇక ప్రేక్షకులందరూ కూడా ఎంటర్టైన్మెంట్ షోలకే అలవాటు పడుతున్నారు.

నిజానికి ఒక ఎంటర్టైన్మెంట్ షో చేయాలి అంటే అందులో ఎంతో కష్టం ఉంటుందని తెలుస్తుంది.ఎన్నో విధాలుగా కంటెస్టెంట్ లు కూడా పర్ఫామెన్స్ చేయటానికి కష్టపడుతూ ఉంటారు.

ఇక జడ్జీలు మాత్రం సీట్ లలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.నిజానికి వాళ్లకు ఎటువంటి కష్టం ఉండదనే చెప్పవచ్చు.

కానీ గంటల తరబడి కూర్చోవడంతో వాళ్లు కూడా అలసిపోతుంటారు.కొన్ని సందర్భాలలో వాళ్లు నిద్రపోయే సందర్భం కూడా వస్తుంది.

Advertisement

ఇక వాటిని ఎడిట్ లో కట్ చేస్తూ ఉంటారు ఎడిటర్లు.దాంతో మనం వాళ్ళని చూసి.

చాలా కష్టపడి గంటల తరబడి కూర్చొని జడ్జిమెంట్ చేస్తుంటారని అనుకుంటాం.కానీ అసలు సంగతి మనకు తెలియదు.

వాటిని కొన్ని కొన్ని సార్లు స్కిట్ ల ద్వారా చూపిస్తూ అసలు నిజాలు బయట పెడుతుంటారు జబర్దస్త్ కమెడియన్లు.ఇప్పటికే జబర్దస్త్ షోలో చాలా మంది కమెడియన్ లు షో లో రోజా చేసే నటనను స్కిట్ ద్వారా చూపించారు.

అందులో రోజా మధ్యలో ఏదో తింటున్నట్టు.పదే పదే ఫోన్ చూస్తూ, సెల్ఫీలు దిగుతూ ఉన్నట్లు అంతేకాకుండా నిద్రపోతున్నట్లు కూడా చూపించారు.దీంతో జబర్దస్త్ భాగోతం మొత్తం బయటపడగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ బాగోతం కూడా బయట పెట్టారు కమెడియన్లు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.అందులో కమెడియన్స్ అంతా తమ పర్ఫామెన్స్ తో సందడి చేశారు.మరికొందరు ఎక్స్ ట్రా పర్ఫామెన్స్ తో హడావుడి చేశారు.

Advertisement

అందులో కమెడియన్ నూకరాజు మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాక్ గ్రౌండ్ ను బయట పెట్టాడు.ఈటీవీ లో మల్లెమాల ప్రొడక్షన్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ షో మంచి ఆదరణలో కొనసాగుతుంది.ఈ షో కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.ఇందులో అలనాటి తార ఇంద్రజ జడ్జి గా చేస్తూ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది.

అందులో కూడా జడ్జీలు, కంటెస్టెంట్ లు మధ్య మధ్యలో తమకు నచ్చినట్లు ఉంటారని నూకరాజు పర్ఫామెన్స్ చేసి చూపించాడు.ఇంద్రజ, సుధీర్ లు కలిసి చేసే డాన్సులను ఫన్నీ గా చేసి చూపించారు.

ఇక ఇంద్రజ మధ్య మధ్యలో నిద్రపోతున్నట్లు స్కిట్ పూర్తయిన తర్వాత ఇంద్రజను నిద్ర లేపడానికి చేసే ప్రయత్నాలు చూపించారు.అంతేకాకుండా రోజా, మను ల మధ్య జరిగే సంభాషణలు కూడా చూపించారు.

దీంతో రోజా తో పాటు అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాక్ గ్రౌండ్ లో ఇంత జరుగుతుందా అని కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు