పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసుని పక్కన పెట్టేసారుగా...

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సొంత నివాసంలో ఈ ఏడాది  జూన్ నెలలో ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే.

సింగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు మొదట్లో ఈ కేసుని వివిధ కోణాల్లో వేగంగానే దర్యాప్తు చేపట్టారు. అంతేకాక ఇందులో భాగంగా యంగ్ హీరోయిన్ మరియు సుశాంత్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఆమెను విచారించే క్రమంలో పోలీసులు రియా చక్రవర్తి మత్తు పదార్థాల వినియోగం మరియు సరఫరాలో డ్రగ్స్ రాకెట్ ముఠా సభ్యులతో సంబంధాలు ఉన్నాయని కనుగొన్నారు.దీంతో ప్రస్తుతం పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు పక్కనబెట్టి డ్రగ్స్ రాకెట్ కేసుపై పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

దీనికితోడు ఇటీవలే రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం సుశాంత్ కి న్యాయం జరగాలంటూ సపోర్ట్ గా నిలిచిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పేరుని చెప్పడంతో కేసులో కొత్త మలుపు తిరిగింది.దీంతో కొందరు నెటిజన్లు ముంబై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 అంతేగాక కనీసం ఇప్పటికైనా తమ అభిమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయిన వారిని కనిపెట్టి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరింత ఆలస్యం చేస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే  అవకాశం ఉందని పోలీసులకు సూచిస్తున్నారు.

  అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసులో ఇప్పటికే టాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ సినీ పరిశ్రమలకి చెందిన మరింతమంది నటీనటులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని, తొందరలోనే వారందరికీ లీగల్ గా నోటీసులు పంపించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు