తెలుగు, తమిళ భాషల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో చంద్రముఖి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.పి.
వాసు డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా 19 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.మలయాళంలో వచ్చిన మణిచిత్రతాయు సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
అయితే ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా మెగాస్టార్ చిరంజీవి వదులుకున్నారని బోగట్టా.
ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన వీఎన్ ఆదిత్య మణిచిత్రతాయు సినిమాను చిరంజీవితో రీమేక్ చేయాలని ఇచ్చి ఆ సినిమా సీడీని చిరంజీవికి ఇచ్చారు.
అయితే చిరంజీవికి ఆ సినిమా ఎందుకో కనెక్ట్ కాలేదు.ఆ కారణం వల్లే వీఎన్ ఆదిత్య ఎంత చెప్పినా ఆయన వినలేదు.
ఆ తర్వాత పి.వాసు చంద్రముఖిని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం జరిగింది.

చంద్రముఖి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత చిరంజీవి వీఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి చంద్రముఖి సినిమా విషయంలో నీ అంచనా నిజమైందని ఆ సినిమాలో నటించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం.ఒకవేళ చంద్రముఖి సినిమాలో చిరంజీవి నటించి ఉంటే ఆ సినిమా కూడా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఉండేదని చెప్పవచ్చు.

మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలో చంద్రముఖి కథ రిస్క్ అని చిరంజీవి భావించి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.చిరంజీవి తన సినీ కెరీర్ లో కమర్షియల్ సినిమాలలో ఎక్కువగా నటించలేదనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు.







