భాంఘర్ కోట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.అదే సమయంలో అది ఆసియాలో అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.భాంఘర్ కోటను అత్యంత రహస్యమైనదిగా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
భాంగర్ కోటకు ప్రయాణం
భాంఘర్ కోట రాజస్థాన్లో ఉంది.ఈ కోటలో అద్భుతమైన వాస్తుశిల్పం కనిపిస్తుంది.ఇక్కడి చారిత్రక సంపదను చూసేందుకు పర్యాటకు తరలి వస్తుంటారు.
అయితే ఇక్కడికి వచ్చేవారి దృష్టి ఈ శిల్పాలకన్నా భాంఘర్ కోటలోని వింత అనుభూతిపై ఎక్కువగా ఉంది.వారిని ఎవరో ఫాలో అవుతున్నట్లు వారికి అనిపిస్తుంది.
భాంఘర్ కోట కథ
భాంఘర్ కోటకు సంబంధించి కొన్ని కథలు ఉన్నాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం భాంగర్ కోట శాపగ్రస్తమైంది.
దీనిని గురు బాలునాథ్ అనే సన్యాసి శపించాడు.ఈ కోట నిర్మాణం ప్రారంభమైనప్పుడు అక్కడ ఒక సాధు మహారాజ్ కూర్చుని ధ్యానం చేసేవాడని చెబుతారు.
ఇక్కడ కోట నిర్మించాలనుకుంటున్నట్లు ఆ ప్రాంతపు రాజు కోరాడు.కోట నిర్మాణానికి అనుమతిస్తూ కోట నీడ తనను తాకకూడదని సన్యాసి షరతు విధించాడు.
రాజు అందుకు అంగీకరించాడు.అయితే కోట సిద్ధం అయ్యాక దాని నీడ సన్యాసిపై పడింది.
దీంతో ఆగ్రహించిన సన్యాసి.ఆ రాజును శపించాడు.
దీంతో గ్రామం మొత్తం నాశనమైందని స్థానికులు చెబుతారు.

భాంగార్ను ఎందుకు భయానకం?
భాంఘర్ కోటకు సంబంధించి ఇలాంటి అనేక వింత కథలు వినిపిస్తుంటాయి.అవి ఇప్పటికీ స్థానికులను వెంటాడుతుంటాయని అంటారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
ఒకప్పుడు ముగ్గురు యువకులు సూర్యాస్తమయం తర్వాత భాంగర్ కోటలో ఉండాలని నిర్ణయించుకున్నారు.కోటలోని విచిత్రాలను తెలుసుకోవాలనుకున్నాడు.
అయితే ఆ సాయంత్రం ఓ యువకుడు బావిలో పడిపోయాడు.మిగిలిన ఇద్దరు యువకులు ఎలాగోలా ఆ యువకుని ప్రాణాలను కాపాడారు.వారు భాంగర్ నుండి బయటపట్డారు.అయితే ఈ సమయంలో ఆ ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

రాత్రిపూట బస నిషేధం?
అటువంటి కథలు ప్రచారమైన నేపధ్యంలో భంగర్ కోట లోపల రాత్రి బస చేయడాన్ని నిషేధించారు.భాంఘర్ కోట సముదాయంలో సూర్యాస్తమయం మొదలుకొని సూర్యుడు ఉదయించే వరకు ఎవరూ బసచేయకూడదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెచ్చరించింది.ఇప్పటి వరకు కోటలోపల రాత్రి బస చేసినవారు ఎవరూ లేరని స్థానికులు చెబుతుంటారు.ఈ కోటలో దెయ్యాలు ఉంటాయని స్థానికులు నమ్ముతారు.