కారు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు దుర్మరణం

ఇంగ్లాడ్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాదం నుంచీ తప్పించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా మృత్యు దేవత కౌగిలి నుంచీ ఆ యువకుడు తప్పించుకోలేక పోయాడు.

వివరాలలోకి వెళ్తే.ఇంగ్లాడ్ లో నివాసం ఉంటున్న ఓ భారతీయ ఎన్నారై కుటుంభానికి చెందిన రాజేష్ చంద్ అనే వ్యక్తి షాపింగ్ చేయడానికి బయటకి వెళ్ళాడు.

షాపింగ్ ముగించుకుని బయటకి వస్తున్న సమయంలో ఒక్క సారిగా వేగంగా వస్తున్న ఒక కారు అతడిని డీ కొట్టింది.దాంతో ఒక్క సారిగా పైకి లేచి దూరంగా పడి పోయిన అతడు తీవ్ర గాయాలతో రక్తమొడుతూ కొట్టుమిట్టాడుతున్నా కారు వేగంగా ఆగకుండా వెళ్ళిపోయింది.

ఇదిలాఉంటే ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం.అతడు రోడ్డు దాతుతున్నాడు.

Advertisement

ఈలోగా వేగంగా కారు వస్తోంది అది చూసిన అతడు తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.కానీ

కారు అతడివైపుగా వచ్చి దూసుకు వెళ్ళిందంటూ సాక్ష్యులు చెప్పారు.ప్రమాదం నుంచీ ఎంతగా తప్పించుకోవాలని అనుకున్నా అతడి ప్రయత్నాలు వృధా అయ్యాయని కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.అయితే ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

మృతిని కుటుంభ సభ్యుల కోరిక మేరకు కుటుంభ సభ్యుల కి సంభందించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు పోలీసులు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు