వ్యాక్సినేషన్ లో భారత్ ప్రపంచ రికార్డ్.. జీ7దేశాలు కంటే అధికం.. ఆగస్టులో 18కోట్ల టీకాలు

కోవిడ్ మహమ్మారి నివారణకు చేపట్టిన వ్యాక్సిన్ దేశంలో మన దేశం ప్రపంచ రికార్డు సృష్టించింది.18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపింది.

ఆగస్టు నెలలో జీ7 దేశాల్లో వేసి మొత్తం వ్యాక్సిన్ కన్న భారత్ లో గత నెలలో చేసిన వ్యాక్సిన్లు ఎక్కువని వెల్లడించింది.జీ7 దేశాలు 10.1 కోట్లు డోసు లు మాత్రమే ఇచ్చాయి.కెనడా, బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాలలో జీ7 దేశాలు గా పిలుస్తారు.జీ7 దేశాల్లో కెనడా అతి తక్కువగా 30 లక్షలు జపాన్ ఎక్కువగా 4 కోట్లు వ్యాక్సిన్ డోసులు వేశాయి భారత్ లో జూన్ 21న వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభం కాగా ఇప్పటివరకు సుమారు 68.54 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.ఇందులో 52.9 కోట్లు మొదటిరోజు కాగా 25.95 కోట్లు సెకండ్ డోసులు.మరోవైపు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 4.37 కోట్లకు పైగా డోసులు నిల్వ ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.డిసెంబర్ నాటికి ప్రజలందరికీ ఉచిత వ్యక్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గత నెలలో ఐదు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు (27న, 31న) కోటికి పైగా డోసులు వేసి సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు