సూర్యాపేట జిల్లా: ఈసారి ఎన్నికల్లో నోటా మాట ఎక్కువగా ఎక్కడా వినిపించలేదు.దానికి కారణం కాంగ్రెస్,బీఆర్ఎస్ మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ నెలకొనడమేనని తెలుస్తోంది.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే 2014 లో నోటాకు 852 ఓట్లు పడగా 2018 లో 1620 ఓట్లు పోలయ్యాయి.
గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి నోటాకు కేవలం 834 ఓట్లే పడ్డాయి.
ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఏ అభ్యర్థి ఓటరుకు నచ్చకపోతే నోటాకు వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిన విషయం తెలిసిందే.