త‌న తండ్రి టీమ్ గెల‌వాలంటూ ధోనీ కూతురు చేసిన ప‌ని చూస్తే..

ప్ర‌స్తుతం ఐపీఎల్ హ‌వా సాగుతోంది మ‌న ఇండియాలో.సాధార‌ణంగానే క్రికెట్ అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది మ‌న దేశంలో.

అలాంటిది ఇక ఐపీఎల్‌కు ఉన్న స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక ఐపీఎల్‌లో ధోనీ సార‌థ్యం వ‌హిస్తున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ అంటే ఫేవ‌రెట్‌.

ఇప్పుడు ఐపీఎల్‌లో నంబర్‌ వన్ ప్లేస్ లో దూసుకుపోతున్న ధోనీ టీమ్ నిన్న సెకండ్ ప్లేస్ లో ఉన్న‌టువంటి ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీ ప‌డింది.ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భ‌రితంగా సాగింద‌నే చెప్పాలి.

ఇక మ్యాచ్ అంటే అక్క‌డ చాలా ర‌కాల ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి.క‌రెక్టుగా అబ్జ‌ర్వ్ చేస్తే ప్ర‌తి మ్యాచ్‌లోనూ ఎన్నో ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి.

Advertisement

అయితే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంగా ధోని కుమార్తె జీవా చేసిన ప‌ని ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.ధోనీకి త‌న కూతురితో ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే తన తండ్రి కెప్టెన్‌గా ఉన్న చెన్నై జట్టు గెలుపు కోసం జీవా ఏకంగా దేవుడ‌ని ప్రార్థిస్తోంది.ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.

దుబయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ సోమ‌వారం జ‌రిగింది.

అయితే మొద‌ట‌గా బ్యాటింగ్ చేసిన చెన్నై జ‌ట్టు 137 పరుగులు చేసింది.ఇక లక్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు టీమ్‌కు చెన్నై గ‌ట్టి పోటీ ఇచ్చింది.కానీ చివ‌రి మూడు ఓవ‌ర్ల‌లో ఢిల్లీకి 28 పరుగులు కావాల్సి ఉంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఈ స‌మ‌యంలోనే అంతా టెన్ష‌న్ ప‌డుతున్నారు.ఎవ‌రు గెలుస్తారో అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న క్ర‌మంలో జీవా త‌న తండ్రి గెల‌వాలంటూ ఇలా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఫొటోలో మ‌న‌కు క‌నిపిస్తుంది.

Advertisement

ఇదిచూసిన ధోనీ అభిమానులు తెగ సంబుర ప‌డిపోతున్నారు.సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ చేస్తున్నారు.

తాజా వార్తలు