టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా విలన్ గా నటిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజు గారు నేడు కన్నుమూశారు.ఇక ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో ఇతర నటీనటులకు చేసే అతిథి మర్యాదల గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు.
ఈయన ఆతిథ్యం స్వీకరించాలంటే ఎంతో కష్టంగా ఉంటుందని అంతలా తన ఇంటికి వెళ్ళిన వారికి మర్యాదలు చేస్తారని ఎప్పుడు చెబుతూ ఉండేవారు.ఈయన మాదిరిగానే ప్రభాస్ సైతం నటీనటులకు పెద్ద ఎత్తున అతిధి మర్యాదలు చేస్తుంటారు.
ఇలా ఇండస్ట్రీలో ప్రభాస్ కూడా తన చిత్ర బృందానికి ఇంటి నుంచి భోజనం తెప్పిస్తారని అయితే వివిధ రకాల ఆహార పదార్థాలతో ఆయన ఎంతో సంతృప్తిగా ఇతరులకు అతిధి మర్యాదలు చేస్తారంటూ ఎంతో మంది సెలబ్రిటీలు ప్రభాస్ ఆతిథ్యం గురించి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.ఇలా ప్రభాస్ కృష్ణంరాజు చేసే అతిథి మర్యాదలు వెనుక ఓ పెద్ద కారణం ఉంది.
అది కనక తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.
కృష్ణంరాజు గారి జన్మించినది పచ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో గోదావరి జిల్లా అంటే అతిధి మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు.ఇక కృష్ణంరాజు గారు చిన్నతనంలో ఓ పెద్దాయన తన ఇంటికి వచ్చినప్పుడు ఈయన తన ముందు కాళ్లు చాపుకొని తాపీగా కూర్చున్నారట.తన తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఆయన వెళ్లే వరకు అలాగే చేయడంతో ఆ అతిథి వెళ్లిన తర్వాత కృష్ణంరాజు తండ్రి కొరడా తెప్పించి మరి తనని చావు కొట్టినట్లు కృష్ణంరాజు ఓ సందర్భంలో వెల్లడించారు.
అప్పటినుంచి ఇతరులను గౌరవించడం వారికి మర్యాద ఇవ్వడం అలవాటుగా చేసుకున్నారని అదే అలవాటు ప్రభాస్ కి కూడా వచ్చిందని తెలుస్తోంది.