తెలంగాణలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు.
మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.అవసరం అయితే అనిల్, విజయమ్మ కూడా పోటీ చేస్తారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనుకుంటున్నట్లు వెల్లడించారు.కాగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఇవాళ వైఎస్ఆర్టీపీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.







