ఈ రోజు ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయంటే.. !

ప్రపంచం నుండి కరోనా ఇంకా పారిపోలేదని తెలిసినా, అందులో కోవిడ్ టీకా వచ్చిందనే ధైర్యంతో ప్రజలంతా కరోనాకు ముందు జీవించినట్లుగా ప్రస్తుతం జీవిస్తున్నారు.

ఏ మాత్రం కరోనా నివారణకు పాటించ వలసిన సూత్రాలు అమలు చేయకుండా వ్యవహరిస్తూ ఉన్నారు.

అయితే కరోనా మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లుతుంది.ఎందుకంటే అదేమైన మన పెంపుడు కుక్క కాదు కదా చెప్పినట్లుగా వినడానికి.

అందుకే చాపకింద నీరులా ఈ వైరస్ ప్రజల ఊపిరిలో తిష్ట వేస్తుంది.ఇకపోతే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసుల వివరాలు వెల్లడించింది.

ఏపీలో గత 24 గంటల్లో 95 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయట.కాగా 129 మంది కరోనా నుండి కోలుకున్నారట.

Advertisement

అయితే విశాఖ జిల్లాలో ఒకరు మృత్యువాత పడగా, ఇప్పటి వరకు 8,88,099 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు అధికారులు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు