పెళ్లైన కొద్దిరోజులకే నటికి భారీ షాక్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా యామీ గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

కొన్నిరోజుల క్రితం ఈ నటికి వివాహం జరిగింది.

అయితే పెళ్లైన కొద్దిరోజులకే ఎన్‌ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ నటికి భారీ షాక్ ఇవ్వడం గమనార్హం.ఈడీ యామీ గౌతమ్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు చేయగా ఈ ఆరోపణల గురించి యామీ గౌతమ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా యామీ గౌతమ్ కు సమన్లు అందాయి.మరికొన్ని రోజుల్లో యామీ గౌతమ్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా అధికారులు ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయనున్నారు.

యామీ ఈడీ నుంచి నోటీసులు జారీ కావడం రెండోసారి అని తెలుస్తోంది.బాలీవుడ్ ఇండస్ట్రీలోకి విక్కీ డోనర్ మూవీతో యామీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

బద్లాపూర్ తో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన యామీ గౌతమ్ ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం యామీ గౌతమ్ చేతిలో ఒక థ్రిల్లర్ మూవీ ఉంది.ఈడీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ భారీ సినిమాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది.టాలీవుడ్ లో యామీ గౌతమ్ కొరియర్ బాయ్ కళ్యాణ్, గౌరవం సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నారు.

కరోనా విజృంభించిన సమయంలో ఆదిత్యను రహస్యంగా యామీ గౌతమ్ వివాహం చేసుకున్నారు.

పలు ప్రముఖ కంపెనీలకు యామీ గౌతమ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.జోన్ 2 అధికారులు ఈ కేసును విచారిస్తూ ఉండటం గమనార్హం.ఈడీ ఇప్పటికే విదేశీ లావాదేవీలపై నిఘా పెట్టడం గమనార్హం.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అధిత్య ధర్ ఉడి చిత్రం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు