రష్మిక టాలీవుడ్ ఎంట్రీకి కారణం అతనేనా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

కన్నడలో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన రష్మిక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ నుండి ఆఫర్ రాగానే అమ్మడికి భయం వేసిందట.టాలీవుడ్ పెద్ద చలన చిత్ర పరిశ్రమ అక్కడ ఎలా ఉంటుందో అని భయపడ్డదట రష్మిక.

అయితే ఆమె తండ్రి మదన్ ధైర్యం చెప్పి తెలుగు సినిమా పరిశ్రమ గురించి చెప్పాడట.నాన్న ఇచ్చిన ఆ ధైర్యంతోనే తెలుగులో నటించానని చెప్పుకొచ్చింది రష్మిక.

ఫాదర్స్ డే నాడు రష్మిక తన ఫాదర్ తో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పింది.ఛలో తో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.

Advertisement

తెలుగులో ఆమెకు వరుస స్టార్ అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది రష్మిక మందన్న.

మరో రెండు క్రేజీ సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఈమధ్యనే అమ్మడు కార్తీ సుల్తాన్ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.

అక్కడ కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది కన్నడ భామ.

ఓ పక్క మాతృ భాష కన్నడలో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది రష్మిక.తెలుగులో మాత్రం టాప్ ప్లేస్ లో ఉంది అమ్మడు.ఆమె తర్వాతే ఎవరైనా అన్న విధంగా ఛాన్సులు వస్తున్నాయి.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు