కన్నీళ్లు పెట్టుకున్న నటి రమ్యకృష్ణ.. ఏం జరిగిందంటే..?

దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించి రమ్యకృష్ణ గుర్తింపును సంపాదించుకున్నారు.

నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్ర, బాహుబలి సిరీస్ సినిమాల్లోని శివగామి పాత్రలతో రమ్యకృష్ణకు నటిగా మంచి పేరు వచ్చింది.

సినిమాలతో పాటు కొన్ని సీరియల్స్ లో కూడా రమ్యకృష్ణ నటించడం గమనార్హం.బాహుబలి సిరీస్ సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో రమ్యకృష్ణ ప్రస్తుతం రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇకపోతే రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.టీవీలో ఇండియన్ ఐడల్ 12 షోను చూసి రమ్యకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు.

ఆ షోకు బాలీవుడ్ నటి రేఖ గెస్ట్ గా హాజరు కాగా రేఖ స్టేజ్ పై చేసిన డ్యాన్స్ ను చూసి రమ్యకృష్ణ ఎమోషనల్ కావడం గమనార్హం." మై గాడ్.

Advertisement

మై గాడెస్.రేఖగారు" అనే క్యాప్షన్ తో రమ్యకృష్ణ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రమ్యకృష్ణ షేర్ చేసిన వీడియోకు వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.మరోవైపు రమ్యకృష్ణ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.నిన్న విడుదలైన రిపబ్లిక్ టీజర్ లో రమ్యకృష్ణ హైలెట్ గా నిలిచారు.

దేవాకట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.పొలిటికల్ థ్రిల్లర్ గా రిపబ్లిక్ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

క్వీన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో కూడా రమ్యకృష్ణ నటించనున్నారని సమాచారం.ఇప్పటికే సెకండ్ సీజన్ కు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి కాగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రల్లో ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు