మాధవీ లత : నన్ను తిట్టే వాళ్ళకి చాలా మంది తండ్రులు ఉంటారు...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకి మరియు అభిమానులకు మధ్య ఉన్నటువంటి దూరం బాగా తగ్గి పోయింది.

దీంతో కొంత మంది సెలబ్రెటీలు తమ హావ భావాలను సోషల్ మీడియా మాధ్యమాలలో వ్యక్త పరుస్తుంటారు.

అయితే ఈ విషయం నచ్చని వారు వారిని దారుణంగా ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తుంటారు.అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదని తన అధికారిక ఫేస్ బుక్  ద్వారా ఓ  పోస్ట్ ని షేర్ చేసింది.

దీంతో కొందరు మాధవీలత పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కామెంట్  చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో ఈ విషయంపై మాధవీలత తాజాగా స్పందించింది.

 ఇందులో భాగంగా తన పై మరియు తన కుటుంబ సభ్యులపై ఇలా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ కామెంట్లు చేసేటువంటి వారికి చాలా మంది తండ్రులు ఉంటారని, వెళ్లి వారి తండ్రి ఎవరో డీఎన్ఏ పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాలని ఘాటుగా సమాధానం ఇచ్చింది.దీంతో మాధవీ లత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

అంతేగాక ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు అవగాహన లేనటువంటి కొందరు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ సెలబ్రిటీల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు