పరిటాల హత్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ

పరిటాల రవి హత్య పై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

పరిటాల రవి హత్య సమయంలో జగన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేయడం తో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాకుండా జగన్ బాబాయి వివేకా హత్యకేసు విషయంలో కూడా దర్యాప్తు ముందుకు సాగకపోవడాననికి జగనే కారణమంటూ హర్షకుమార్ ఆరోపించారు.కచ్చులూరు బోట్ ప్రమాదం విషయంలో ఒత్తిడి తెచ్చినందుకే జగన్ ప్రభుత్వం తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపణలు చేసారు.

అలానే అమరావతి నుంచి రాజధాని మార్చాలంటే సీఎం జగన్ ముందుగా ఎన్నికలకు వెళ్లాలనీ డిమాండ్ చేశారు.కచ్చులూరు బోట్ ప్రమాదంలో నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలోని దేవిపట్నం మండల కచ్చిలూరు గ్రామానికి సమీపంలో ఉన్న గోదావరి నదిలో గతేడాది విషాద పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

తాజా వార్తలు