హ‌రీశ్‌రావు చ‌రిత్ర బ‌య‌ట‌పెడుతానంటున్న ఈట‌ల‌.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇప్పుడు హుజూరాబాద్ లో ఉప ఎన్నిక‌ల రాజకీయం పార్టీల మ‌ధ్య కాకుండా వ్య‌క్తుల మ‌ధ్య అన్న‌ట్టు న‌డుస్తోంది.

మ‌రీ ముఖ్యంగా ఒక‌ప్పుడు స్నేహితులుగా మెలిగిన హ‌రీశ్ రావు అలాగే ఈట‌ల రాజేంద‌ర్ మ‌ధ్య త‌గ్గ పోరే న‌డుస్తోంద‌ని చెప్పాలి.

స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో హీటెక్కుతోంది.వాస్త‌వానికి ఈనెలలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు వ‌స్తాయ‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో మొన్న‌టి వ‌ర‌కు కాస్త సైలెంట్ గా ఉన్న వారు ఇప్పుడు జోరు పెంచారు.

ఇద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ మాటల యుద్ధం న‌డిపిస్తున్నారు.ఇక గ‌తంలో కూడా హ‌రీశ్‌రావుపై కొన్ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోసారి ఇదే పంథాలో హ‌రీశ్‌రావుపై సంచలన వ్యాఖ్య‌లు చేశారు.

టీఆర్ ఎస్ హ‌యాంలో తెలంగాణలో అస్స‌లు అభివృద్ధి అనేదే జరగలేదని ఏ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా టార్గెట్ కు త‌గ్గ‌ట్టు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏ ఎమ్మెల్యే కూడా కట్టలేద‌ని దీనిపై ఎక్క‌డికంటే అక్క‌డ‌కు వ‌స్తానని, అవ‌స‌ర‌మైతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏ విష‌జ్ఞంపై అయినా స‌రే మాట్లాడేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ స‌వాల్ కూడా విసిరారు.అయితే ఈ సంద‌ర్భంగా మ‌రో సంచ‌ల‌న కామెంట్లు చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌.

Advertisement

అదేంటంటే గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు హ‌రీశ్‌రావు కుట్ర‌లు చేశార‌ని, తానే అడ్డుకున్నాన‌ని తెలిపారు.త‌న మ‌నుషులను గెలిపించుకునేందుకు హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రికి డ‌బ్బులు కూడా పంపార‌ని తానే సాక్ష్య‌మ‌ని ఆరోపించారు.ఇక హ‌రీశ్‌రావు చ‌రిత్ర ఎలాంటిదో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడుతాన‌ని రెడీగా ఉండాలంటూ సంచ‌ల‌న కామెంట్లు చేయ‌డం ఇప్పుడు రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ముఖ్యంగా టీఆర్ ఎస్‌లోనే టెన్ష‌న్ పెడుతున్న‌ట్టు చ‌ర్చ సాగుతోంది.చూడాలి మ‌రి ఈట‌ల రాజేంద‌ర్ ఎలాంటి చ‌రిత్ర బ‌య‌ట‌పెడుతారో.

Advertisement

తాజా వార్తలు