కోదండరామ్ కి గట్టి వార్నింగ్

తెలంగాణ ప్ర‌భుత్వంపై జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస తూటాలు పేలుస్తోంది.

కోదండరామ్‌ను జేఏసీ చైర్మన్ను చేసింది కేసీఆరేనని, తెరాస లేకుంటే ఐకాస ఎక్కడిదని తెలంగాణ నీటిపారుల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు.తెరాస ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక‌ నివారణకు తీసుకున్న చర్యలను ఈ దేశ‌ ప్రధాన మంత్రి సైతం ప్రశంసింస్తుంటే,, జేఏసీకి క‌నిపిండం లేదా? అని నిల‌దీసారు.ఆంధ్ర‌పాల‌కుల కార‌ణంగానే న‌ష్ట‌పోయిన రైతులు నేటికీ ఆత్మ‌హ‌త్య‌కు పాల‌ప్డుతున్నార‌ని, వీటికి ప్ర‌భుత్వ‌మే కార‌ణమంటూ నింద‌లు కోదండ‌రామ్‌కు చెల్ల‌ద‌న్నారు జేఏసీ చైర్మ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల వెనుక ప్రతిపక్షాలున్నాయ‌ని, రాజకీయ దురుద్దేశంతోనే ఇలా మాట్లాడిన‌ట్టు కనిపిస్తోందని హ‌రీష్ ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ ఋణం తీర్చుకోవాల్సిన పెద్దాయ‌న నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌ట‌మేంట‌ని కోదండ‌రామ్‌పై ధ్వ‌జ‌మెత్త‌డం ద్వారా అధినేత దృష్టిలో ప‌డేందుకు మ‌రింద‌రు నేత‌లు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

నీటిలో నానుతున్న విజయవాడ.. బ్రహ్మం గారి కాలజ్ఞానం పైనే చర్చ 
Advertisement

తాజా వార్తలు