గుడ్‌న్యూస్‌.. సూపర్‌ హిట్‌ కాంబో మూవీ క్యాన్సిల్‌ కాలేదు

18 సంవత్సరాల తర్వాత అభిమానులు కోరుకుంటున్న తమిళ స్టార్‌ హీరో సూర్య మరియు ప్రముఖ దర్శకుడు బాలా కాంబోలో సినిమా రాబోతుంది అంటూ కొన్ని నెలల క్రితం ప్రకటన వచ్చింది.

సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం పడుతుందని.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని ఆ సమయంలో ప్రకటించారు.కాని గత రెండు మూడు రోజులుగా తమిళ మీడియాలో బాలా మరియు సూర్య కాంబో సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

ఇద్దరి మద్య క్రియేటివ్‌ విభేదాల కారణంగా స్క్రిప్ట్‌ విషయంలో మార్పులు చేర్పులకు బాలా ఒప్పుకోక పోవడంతో సూర్య ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఆ వార్తలు నిజం కాదు అన్నట్లుగా నిరూపించేందుకు గాను సూర్య తమ సినిమా షూటింగ్‌ పనులు జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కాస్త ఆలస్యంగా అయినా సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తమిళ సినీ ప్రేమికులకు హామీ ఇచ్చాడు.వీరిద్దరు కలిసి రెండు దశాబ్దాల తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం వల్ల కేవలం తమిళ ప్రేక్షకుల్లోనే కాకుండా మొత్తం సౌత్‌ లో కూడా ఆసక్తి ఉంది.

Advertisement

బాలా అంటే ఒక విభిన్నమైన దర్శకుడు.ఆయన కేవలం తమిళంలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శకుడు.

అందుకే ఆయన సినిమా లు పాన్ ఇండియా రేంజ్‌ లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.సూర్య తో చేస్తున్ నీ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ అంటూ అంతా భావించారు.

కాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే ఉద్దేశ్యం బాలా కు ఉన్నట్లుగా లేదు.బాలా మరియు సూర్య కాంబో సినిమా క్యాన్సిల్‌ అంటూ వచ్చిన వార్తలకు క్లారిటీ ఇవ్వడంతో సూర్య అభిమానులు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు.

బాలా అభిమానులు ఖచ్చితంగా సూర్యతో సినిమాను ఆస్వాదిస్తారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు