సీఎం జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి

ఏపీ సీఎంగా జగన్ పాలన నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో ప్రభుత్వ సలహాదారు సజ్జల పాల్గొన్నారు.కేక్ కట్ చేసిన ఆయన వైసీపీ జెండాను ఎగురవేశారు.

అనంతరం మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో చరిత్ర సృష్టించామని తెలిపారు.జగన్ గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 98 శాతం పూర్తి చేశామన్న ఆయన వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని వెల్లడించారు.తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

Advertisement

చంద్రబాబు హామీలు ఇచ్చి గతంలో ప్రజలను మోసం చేశారని చెప్పారు.రైతు రుణమాఫీ చేశానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని సజ్జల ప్రశ్నించారు.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు