హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా బండ్లగూడ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
జనవరి నెలలో ఆల్రెడీ ఈ ప్రాంతంలో రబ్బరు కంపెనీ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఆ సమయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
అదుపు చేయటానికి ఫైర్ సిబ్బంది అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.సరిగ్గా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రంగారెడ్డి మెదక్ సరిహద్దు ప్రాంతంలో బండ్లగూడ పారిశ్రామికవాడలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
కాగా ఇప్పుడు.అదే ప్రాంతంలో ఫుడ్ పాత్ పై ఓ షాపులో మంటలు చెలరేగాయి.
ఈ అగ్ని ప్రమాదంలో మహిళా గాయపడటంతో పాటు మంటలను అదుపు చేయటానికి వచ్చిన ఫైర్ సిబ్బంది కూడా గాయపడ్డారు.మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.
అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డ మహిళా మరియు ఫైర్ సిబ్బందికి పెద్దగా గాయాలు కాలేదు.మరో పక్క మాత్రం మంటలు భారీ ఎత్తున చెల్లరేగుతున్నాయి.
ఈ ఏడాది జనవరి నెలలో ఇప్పుడు ఫిబ్రవరి నెలలో బండ్లగూడ ప్రాంతంలో వరుసగా రెండుసార్లు అగ్ని ప్రమాద సంఘటనలు చోటు చేసుకోవడంతో.ఈ ప్రాంత వాసులు భయపడుతున్నారు.