నేడు గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని రైతులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు.ఎర్రకోటను టార్గెట్ గా పెట్టుకొని రైతులు ట్రాక్టర్స్ ర్యాలీని చేపట్టారు.
నిరసనలు, ధర్నాలు చేస్తూ ఢిల్లీలోని ఐటిఓ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ ర్యాలీని మొదలు పెట్టారు.ఈ నేపథ్యంలో పోలీసు లు అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ చార్జ్ చెయ్యడం మొదలు పెట్టారు.
ఆ సమయమలో చాలా మంది రైతులు గాయపడ్డారు.ఆయన రైతులు పోలీసులను లెక్కచెయ్యకుండా వారిని నెట్టేసుకొని ట్రాక్టర్స్ తో ఎర్రకోటకు చేరుకున్నారు.
అక్కడ జాతీయజెండాను ఎగిరవేసే స్తంభం పై తమ జెండాను ఎగరవేశారు.ఎర్రకోట ప్రాంగణం ఎటు చూసిన రైతుల నినాదాలతో హోరెత్తింది.ఈ నేపథ్యంలో ఓ రైతు చనిపోయాడు.ఆ రైతు పోలీసుల తుటాకే చనిపోయాడు అంటూ రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు లు మాత్రం ఈ విషయంను ఖండిస్తూ లేదు ట్రాక్టర్ నుండి కింద పడి చనిపోయాడు అని చెబుతున్నారు.రైతులు ఈ విషయంపై ఉద్యమంను ఇంకా ఎక్కువగా ఉదృతం చేసే అవకాశం ఉందని అంచనా వేసి గాంధీ చౌక్, పార్లమెంట్ భవన్,మెట్రో స్టేషన్స్, పలు హింసాత్మక ప్రదేశాలను ఖాళీ చేయించారు.
పర్యాటకులను తక్షణమే డిల్లీ వదిలి వెళ్లాలని సూచించారు.