సికింద్రాబాద్ మారేడ్పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఓ వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.ప్రతిరోజు ఉదయం 10 గంటలకు రెండు నెలల పాటు విచారణ అధికారి ముందు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, గతంలో రెండుసార్లు నాగేశ్వరరావు బెయిల్ ను రంగారెడ్డి కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.