బీఆర్ఎస్ ను OLX లో సేల్ పెట్టినా కొనేవాళ్లు లేరు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీఆర్ఎస్( BRS ) పని అయిపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) అన్నారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను OLX లో సేల్ అని పెట్టినా కొనేవాళ్లు లేరని ఎద్దేవా చేశారు.

మరోవైపు అభద్రతా భావంతో ప్రజలను కాంగ్రెస్( Congress ) అయోమయానికి గురి చేస్తోందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

కుల, మతాలకు అతీతంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని ఆయన తెలిపారు.కేంద్ర పథకాలు పొందేవారిలో ఎక్కువ శాతం మంది పేద ముస్లింలేనని పేర్కొన్నారు.

విభజించి పాలించే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుందన్నారు.ఈ క్రమంలోనే సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోనేది బీజేపీనేనని స్పష్టం చేశారు.

Advertisement

వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు.

వైరల్ వీడియో : ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..
Advertisement

తాజా వార్తలు