ఎమోషనల్.. తల్లి ప్రేమను చాటి చెప్పే వీడియో ఇది!

నిత్యం సోషల్ మీడియా(Social media )లో వివిధ రకాల వీడియోలు కనిపిస్తుంటాయి.ముఖ్యంగా అందులో కొన్ని మన మనసుకు హత్తుకుంటాయి.

వాటిని చూడగానే ఒక్కోసారి హృదయం ద్రవించుకుపోతుంది.ముఖ్యంగా తల్లి ప్రేమకు సంబంధించిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

తల్లి ప్రేమకు సాటి అయినది ఇంకొకటి ఉండదని అందరూ అంటుంటారు.అది నిజం.

పేదరికంలో ఉన్నా, ధనికులైనా పిల్లల పట్ల తల్లి ఎంతో ప్రేమను చూపిస్తుంటుంది.పిల్లలు మాత్రమే తన ప్రపంచం అన్నట్లు బ్రతుకుతుంది.

Advertisement

తన జీవితాన్ని పిల్లల కోసం త్యాగం చేస్తుంది.తాను పేదరికంలో ఉన్నా పిల్లల ఆశలు, కోరికలు తీర్చేందుకు ఎంతోగానే తల్లి శ్రమిస్తుంది.

పిల్లల సంతోషమే తనకు ముఖ్యం అనుకునే తల్లులు కోకొల్లలు.ఇలాంటి ఓ తల్లి ప్రేమకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

పిల్లల ముఖంలో సంతోషం చూసేందుకు తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతుంటారు.ఇక పేదలు, మధ్య తరగతి కుటుంబల్లో మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ, ఉపాధి కోసం ఉద్యోగం లేదా కూలిపనులు కూడా చేస్తుంటారు.ఇలా బెలూన్లు విక్రయించే ఓ మహిళ తన పిల్లలు తమను ఫొటో తీయాలని అడగడంతో కాదనలేదు.

తమను ఫొటో తీయాలని పిల్లలు పట్టుబట్టారు.వెంటనే వారు ఫోజివ్వగానే తన సెల్ ఫోన్ ద్వారా వారిని ఆ మహిళ క్లిక్ మనిపించింది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

ఫొటో తీశాక పిల్లలు కేరింతలు కొట్టారు.

Advertisement

వారి ముఖంలో సంతోషం చూసి ఆ పేద మహిళ ముఖం వెలిగిపోయింది.అంతకంటే తనకు కావాల్సింది ఏముందనే తృప్తి ఆమె ముఖంలో కనిపించింది.ఈ వీడియో చూడగానే నెటిజన్లు చాలా ఎమోషనల్ అవుతున్నారు.

తల్లి ఎంత పేదరికంలో ఉన్నా పిల్లల సంతోషం కోసం ఏదైనా చేస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.తల్లి ప్రేమకు సాటి అయినది ఇంకొకటి లేదని చెబుతున్నారు.అమోల్‌అవాతే79 అనే ట్విట్టర్( Twitter ) ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

తాజా వార్తలు